చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ !

రేపు ఎన్నికల ఫలితాల వెలువడుతున్న నేపథ్యంలో భద్రతా చర్యల్లో పోలీసులు నిమగ్నమయ్యారు

Last Updated : May 22, 2019, 11:54 AM IST
చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ !

మరో 24 గంటల్లో లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు కౌంటింగ్ కేంద్రాల భద్రతను చూసుకుంటూనే...నేతల ఇళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ నివాసాల వద్ద స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ చేశారు. వీరిద్దరి  నివాసాల వద్ద రెండేసి కంపెనీలు పహరా కాస్తాయి.  వీరికి అదనంగా స్థానిక పోలీసులు 50 మంది చొప్పున భద్రత విధుల్లో ఉంటారు

గెలుపోటముల తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా నియంత్రించేందుకు గాను.....పార్టీ అభ్యర్థులు, నేతలు తమ పార్టీ గెలుపొందిన వెంటనే నేరుగా పార్టీ అధినేతల ఇంటికి  వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఆయా పార్టీలకు చెందిన నేతలు తరలివస్తే వారందరిని నియంత్రించటం స్ధానిక పోలీసులకు కష్టమవుతుంది.. ఈ నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ చేశారు. దీంతో పాటు సాధారణ పోలీసులను భద్రత విధులకు తీసుకున్నారు.

Trending News