అరుణ్ జైట్లీ మృతి: సంతాపం ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

అరుణ్ జైట్లీ మృతి: సంతాపం ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

Last Updated : Aug 24, 2019, 07:30 PM IST
అరుణ్ జైట్లీ మృతి: సంతాపం ప్రకటించిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్ జైట్లీ మృతిపై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అరుణ్‌జైట్లీ మృతి పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి,  తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా కే లక్ష్మణ్‌, ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తమ సంతాపం ప్రకటించారు.

Trending News