రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య

Last Updated : Dec 18, 2017, 01:32 PM IST
రైల్వే ట్రాక్ పై ప్రేమ జంట ఆత్మహత్య
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని గోర్స రైల్వే గేట్‌ వద్ద సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడంలో విఫలమైన ఓ ప్రేమ జంట గోర్స రైల్వే గేటు సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డాకా ఆ మార్గం ద్వారా రాకపోకలు సాగించే పలు రైళ్లు మృతదేహాలపై నుంచి వెళ్లడంతో శరీర అవయవాలు నుజ్జునుజ్జయి చెల్లాచెదురుగా పడిపోయాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
ప్రస్తుతానికి చనిపోయిన ప్రేమజంట ఎవరు?  ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు ? అనే వివరాలేవీ పోలీసులకి లభించలేదు. దీంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాకే మృతుల వివరాలు వెల్లడించగలమని స్థానిక పోలీసులు తెలిపారు. 
 
 

Trending News