Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్ డేస్ సేల్​ షురూ.. డీల్స్ ఇవే..

Flipkart Big Saving Days: ఆన్​లైన్ షాపింగ్ సంస్థ ప్లిప్​కార్ట్ సమ్మర్​ స్పెషల్​ 'బిగ్​ సేవంగ్​ డేస్​' సేల్​తో ముందుకొచ్చింది. ప్లస్ మెంబర్స్​కు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్​ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 03:36 PM IST
  • ఫ్లిప్​కార్ట్ మరో భారీ సేల్​
  • రేపటి నుంచే అందుబాటులోకి..
  • ప్లస్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి డీల్స్​
Flipkart Big Saving Days: ఫ్లిప్​కార్ట్ బిగ్​ సేవింగ్ డేస్ సేల్​ షురూ.. డీల్స్ ఇవే..

Flipkart Big Saving Days: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ మరోసారి భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. 'బిగ్​ సేవింగ్ డేస్​' పేరుతో ఈ డిస్కౌంట్లు ఉస్తోంది. మొబైల్ ఫోన్స్​, వాషింగ్ మిషన్స్​, ఎయిర్ కండీషనర్స్​, రిఫ్రిజిరేటర్స్​, కిచెన్ అప్లయిన్సెస్​ సహా ఎలక్ట్రానిక్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ ఆఫర్లు  మార్చి 12న ప్రారంభమై మార్చి 16న ముగియనుంది.

ఇప్పటికే ఫ్లిప్​కార్ట్ ప్లస్​ సభ్యులకు ఈ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ యూజర్లకు రేపటి నుంచి ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. స్పెషల్ సేల్ ఆఫర్లతో పాటు ఎస్​బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపే వారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే వీలుంది.

ఆఫర్​ వివరాలు ఇలా..

దిగ్గజ స్మార్ట్​ఫోన్ల బ్రాండ్లలో.. ఐఫోన్​ ఎస్​ (2020), పోకో ఎం3 ప్రో, మోటోరోలా ఎడ్జ్​ 20 ఫ్యూజన్​ సహా ఇతర స్మార్ట్​ఫోన్లపై భారీ డిస్కౌంట్స్​ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​.

ఐఫోన్​ ఎస్​ఈ (2020)పై.. ఇప్పటికే ఈ ఫోన్ల తయారీని ఇప్పటికే ఆపేసింది యాపిల్​. అయితే థార్ట్​ పార్టీ ప్లాట్​ఫామ్​ల వద్ద స్టాక్ ఉండటంతో వాటిని ఇప్పుడు భారీ డిస్కౌంట్​కు విక్రయిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్​కార్ట్​ ఐఫోన్​ ఎస్​ఈ 2020ని రూ.29,999కి విక్రయిస్తోంది. దీనితో పాటు ఎస్​బీఐ కార్డ్​ ద్వారా రూ.750 వరకు డిస్కౌంట్ పొందే వీలుంది.

మోటోరోలా ఎడ్జ్​ 20 ఫ్యూజన్​ 8 జీబీ ర్యామ్​ స్మార్ట్​ఫోన్​ ధర రూ.20,749గా ఉంటే.. డిస్కౌంట్​ ధర రూ.19,749గా ఉంచింది. దీనితో పాటు ఎస్​బీఐ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే రూ.750 తగ్గింపు లభిస్తుంది

స్మార్ట్​ టీవీలపై

ఎంఐ 4ఏ ప్రో 32 అంగుళాల.. స్మార్ట్​ టీవీపై 22 శాతం తగ్గింపు ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. దీనితో రూ.19,999 విలువైన ఈ మోడల్ ధరను రూ.15,499 వద్దకు చేరింది.

శాంసంగ్​ 32 అంగుళాల డిస్​ప్లే స్మార్ట్​టీవీపై 25 శాతం డిస్కౌంట్​తో రూ.16,990లకు విక్రయిస్తోంది. ఈ మోడల్ అసలు ధర రూ.22,900గా ఉండటం గమమనార్హం.

ప్యానసోనిక్​ 1 టన్​ 5 స్టార్​ స్ప్లిట్​ ఇన్వర్టర్​ ఏసీపై 26 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. ఈ ఆఫర్ ద్వారా రూ.47,700 విలువైన ఈ ప్రోడక్ట్​ను రూ.34,990కే కొనే అవకాశముంది.

ఇక ఈ ఆఫర్లతో పాటు ఎస్​బీఐ క్రెడిట్​ కార్డ్​ ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు.

Also read: Pepaid Recharge Plans: ఎయిర్​టెల్, వి, జియోల్లో.. రూ.200 లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..!

Also read: Flipkart Realme 8: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.2,099 ధరకే రియల్ మీ స్మార్ట్ ఫోన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News