Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే

Madhabi Puri Buch’s Link With Blackstone  : అదానీ మనీ సిఫనింగ్ కుంభకోణంతో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ ఫండ్స్ లో తన ప్రమేయం లేదని సెబీ చీఫ్ బుచ్ తిరస్కరించినప్పటికీ. ఆమె బ్లాక్ స్టోన్ సంస్థతో సంబంధాల గురించి అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ ది మార్నింగ్ కాంటెక్స్ట్ వెబ్ పోర్టల్ రిపోర్ట్ విడుదల చేసింది. బ్లాక్‌స్టోన్‌తో సంబంధాలు విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది.   

Written by - Bhoomi | Last Updated : Aug 22, 2024, 11:46 PM IST
Madhabi Puri Buch’s : బ్లాక్‌స్టోన్‌తో సెబీ చీఫ్ మధాబి పూరీ బుచ్‌కి ఉన్న సంబంధం ఇంకా కొనసాగుతోందా.. కీలకమైన అంశాలు ఇవే

Madhabi Puri-Buch's Blackstone connection :సెబీ చైర్పర్సన్ గా మాదాభి పూరి బుచ్  ఇటీవల హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం వివాదాల్లో ఇరుక్కున్నారుజ ఈ సందర్భంగా ఆమె హిండెన్ బర్గ్ గ్రూప్ చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా బ్లాక్ స్టోన్ కు సంబంధించిన అన్ని అంశాల నుంచి తాను వైదొలిగినట్లు పేర్కొన్నారు. బ్లాక్ స్టోన్ తో ప్రస్తుతం తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆమె వివరణ సైతం ఇచ్చారు. సెబీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే తాను బ్లాక్ స్టోన్ కు సంబంధించిన అన్ని పదవుల నుంచి కూడా తప్పకుండా పేర్కొన్నారు.

 ఇదిలా ఉంటే అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్  చేసిన ఆరోపణల్లో ముఖ్యంగా ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్ లో ఆమెకు అనుబంధం ఉందని ప్రధానంగా ఆరోపించింది. 2017 లో సెబీలో సభ్యురాలుగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2022లో ఆమె సెబీ  చీఫ్ గా ఎన్నికయ్యారు. అయితే ఆమె సెబీ చైర్ పర్సన్ గా ఎన్నిక కాకముందు బ్లాక్ స్టోన్ లో పలు కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె భర్త ధవల్ బుచ్ 2019 నుంచి సీనియర్ అడ్వైజర్ గా ఉన్నారు. 

Also Read : KL Rahul Retirement: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..ఆ పోస్టు అర్థమేంటీ?  

తాజాగా ది మార్నింగ్ కాంటెక్స్ట్ అనే వెబ్ పోర్టల్ పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఇందులో ప్రధానంగా బ్లాక్ స్టోన్ పెట్టుబడి సంస్థకు మదాబి బుచ్ మధ్య విడదీయరాని సంబంధం ఉందని రిపోర్టుల్లో తెలిపింది. ముఖ్యంగా  రిపోర్ట్స్ ప్రకారం, భారతదేశంలో వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన  US ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన బ్లాక్‌స్టోన్‌తో బుచ్  సంబంధాలు ఉన్నాయని. పలు సంస్థల్లో  బ్లాక్‌స్టోన్ పెట్టుబడి పెట్టిన స్థాయిని బట్టి చూస్తే, బ్లాక్‌స్టోన్-సంబంధిత విషయాల నుండి బుచ్‌ని వేరు చేయలేమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వెటరన్ ఫండ్ మేనేజర్ ది మార్నింగ్ కాంటెక్స్ట్ రిపోర్టులో పేర్కొన్నారు. 

Also Read : Gold-Silver Rates Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

బ్లాక్‌స్టోన్‌కు సంబంధించిన బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నట్లు బుచ్ చెప్పినప్పటికీ, బ్లాక్‌స్టోన్ దాని వివిధ అనుబంధ సంస్థల ద్వారా పూర్తిగా స్వంతం చేసుకున్న లే కంపెనీల గురించి ఆమె ప్రస్తావించలేదు. అటువంటి కంపెనీలలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ప్రస్తుతం సమ్మాన్ క్యాపిటల్), ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ASK ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్, కేర్ హాస్పిటల్స్, ఎంఫాసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నింటిలో  బ్లాక్‌స్టోన్ గ్రూప్  50 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.  

ఫిబ్రవరిలో SEBI బ్లాక్‌స్టోన్-నియంత్రిత కంపెనీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్  ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ఆమోదించింది. అదనంగా, బ్లాక్‌స్టోన్ ఏప్రిల్ - అక్టోబర్ 2019 మధ్య దాని అనుబంధ సంస్థ Epsilon Bidco Pte Ltd ద్వారా EPL లిమిటెడ్ (గతంలో Essel Propack Limited)లో 75% వాటాను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో బుచ్ ఇంకా బ్లాక్‌స్టోన్-సంబంధిత విషయాల నుండి విరమించుకున్నారా లేదా అనే విషయంపై ప్రశ్నార్థకంగా ఉందని ది మార్నింగ్ కాంటెక్స్ట్ రిపోర్టులో వెల్లడించింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News