Allu Arjun: వరద బాధితులకు నేను సైతం అంటూ అల్లు అర్జున్ భారీ విరాళం..

Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో గతంలో కనీవినీ ఎరగనీ రీతిలో వరద బీభత్సం ముంచుకు రావడంతో ప్రజలు రోడ్డున పడ్డారు. చెట్టుకొరకు.. పుట్టకొకరు అన్నట్టుగా తయారైంది వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి.  దీంతో ఇరు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తెలుగు హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. తాజాగా సినీ హీరో అల్లు అర్జున్ తన వంతుగా భారీ విరాళం అందజేస్తున్నట్టు ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 4, 2024, 02:34 PM IST
Allu Arjun: వరద బాధితులకు నేను సైతం అంటూ అల్లు అర్జున్ భారీ విరాళం..

Allu Arjun: తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తే మేమున్నామంటూ మన హీరోలు ఎపుడు ముందుంటారు. ఇప్పటికే వరద బీభత్సంతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవడానికి వివిధ వర్గాల ప్రజలు, ఉద్యోగులు తమకు తోచిన రీతిలో సాయం అందజేస్తున్నారు. ఈ కోవలో టాలీవుడ్ హీరోలుకూడా వరదలతో అల్లాడుతున్న తెలుగు ప్రజలను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయలను విరాళంగా అందజేసారు. అటు బాలయ్య, చిరంజీవి, మహేష్ బాబు వంటి హీరోలు కూడా చెరో రూ. 50 లక్షల చొప్పున కోటి రూపాయలను విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే కదా. అటు రెబల్ స్టార్ ప్రభాస్.. చెరో కోటి రూపాయల చొప్పున ఇరు రాష్ట్రాలకు కలిసి రూ. 2 కోట్ల విరాళం అందజేసి తన పెద్ద మనసును చాటుకున్నారు.

మరోవైపు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయలను విరాళం  ప్రకటించారు. సీఎం రిలీఫ్ ఫండ్ పేరిట ఈ చెక్కులను త్వరలో అందజేయనున్నారు. అల్లు అర్జున్ విషయానికొస్తే.. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప -1 ది రైజ్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నాడు. తెలుగు నుంచి బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డు అందుకున్న తొలి హీరోగా రికార్డులు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమాకు సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు అందుకోవడం విశేషం.

త్వరలో అల్లు అర్జున్..పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు. పుష్ప ది రూల్ పేరిట తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, రష్మికతో అల్లు అర్జున్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x