కళ్యాణ వైభోగం 31 జులై ఎపిసోడ్: ఎత్తుకు పైఎత్తులతో నడిచిన ఎపిసోడ్

ఎత్తుకు పైఎత్తులతో నడిచిన కళ్యాణ వైభోగం 31 జులై ఎపిసోడ్

Last Updated : Aug 1, 2018, 07:07 PM IST
కళ్యాణ వైభోగం 31 జులై ఎపిసోడ్: ఎత్తుకు పైఎత్తులతో నడిచిన ఎపిసోడ్

మీ అభిమాన జీ తెలుగులో మీరు అభిమానించే కళ్యాణ వైభోగం సీరియల్ జులై 31వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌లో ఎత్తుకు పైఎత్తులతో నడిచిన తీరు ఆడియెన్స్‌‌ని ఆకట్టుకుంటోంది. మంగ, జై కలిసి దేవీపురం బయల్దేరుతారు. చారి కూడా వాళ్లతో పాటు వస్తా అంటూ బయల్దేరుతుండగా అందరూ వీడ్కోలు పలుకుతారు. సరిగ్గా అదే సమయంలో ఎవ్వరూ ఊహించని విధంగా స్వరూప, నిత్య ఎదురొస్తారు. వచ్చీ రావడంతోనే మీరు దేవీపురం వెళ్లాల్సిన అవసరం లేదని, దేవీపురం నుండి లెక్కలు తీసుకుని రైతులే వచ్చారని చెబుతారు. 

 

మంగ షాక్ అవుతుంది. రైతులు కౌలు లెక్కలు చూపిస్తూ డబ్బులు ఇచ్చేసరికి దేవీపురం టూర్ క్యాన్సిల్ అయిందని సంబరపడిపోతుంది నిత్య. మంగ నిరాశతో ఇంట్లోకి వెళ్తుంది. సిటీలో వున్న వాళ్లకే అంత వుంటే, పల్లెటూరి తెలివితేటలు చూపిస్తా అంటూ మంగ నాటకమాడి కిందపడిపోతుంది. అందరూ కంగారుగా వచ్చేసరికి, కళ్లు తిరిగిపడిపోయానని, దేవీపురం గుళ్లో అమ్మవారే తనకి కనపడినట్టు చెప్పేసరికి ఇంట్లో అందరూ భయపడిపోతారు. వెంటనే దేవీపురం వెళ్లి కుంకుమార్చనతో పాటు మిగితా పూజలు కూడా చేయమని చెప్తారు. 

మంగ గర్వంగా స్వరూపను చూస్తుంది. నిత్య, స్వరూప ఇద్దరూ కూడా ఎలాగైనా సరే మంగను ఆపాలని అనుకుంటారు. కానీ మంగ ముందు వాళ్ల పాచిక పారదు. ఎలాగైతేనేం దేవీపురానికి జై, మంగ బయల్దేరడానికి కారులో కూర్చుంటూ స్వరూపతో, మమ్, నాకు ఎదురురావా అంటూ ఇంకా స్వరూపను రెచ్చగొట్టే సన్నివేశంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ సీరియల్ ఎపిసోడ్స్‌ని ZEE5 ఎపిసోడ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Trending News