'సరిలేరు నీకెవ్వరు' సాయిబాబా అంటున్న మహేష్ బాబు

తెలుగు సూపర్ స్టార్ .. మహేష్ బాబు షిరిడీ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసిన షిరిడీ సాయినాథుని ఆలయాన్ని దర్శించారు.  షిరిడీ సంస్థాన్ సిబ్బంది .. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక స్వాగతం పలికారు.

Last Updated : Dec 30, 2019, 01:26 PM IST
'సరిలేరు నీకెవ్వరు' సాయిబాబా అంటున్న మహేష్ బాబు

తెలుగు సూపర్ స్టార్ .. మహేష్ బాబు షిరిడీ ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసిన షిరిడీ సాయినాథుని ఆలయాన్ని దర్శించారు.  షిరిడీ సంస్థాన్ సిబ్బంది .. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక స్వాగతం పలికారు. షిరిడీ సాయిబాబాను దర్శించుకున్న మహేష్.. బాబా ఆశీర్వాదం తీసుకున్నారు.  ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్  బాబు . . షిరిడీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.  చిత్రం విడుదల తర్వాత మంచి సూపర్ హిట్ సాధించాలని షిరిడీ సాయినాథున్ని మహేష్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కొన్ని చిత్రాల విడుదల సందర్భంగా మహేష్ బాబు తిరుపతికి వెళ్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈసారికి కాస్త భిన్నంగా షిరిడీకి వెళ్లడంపై చర్చలు కొనసాగుతున్నాయి.

మహేష్  బాబుతోపాటు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. వారితోపాటు కుమారుడు గౌతమ్ కృష్ణ, కూతురు సితార కూడా ఉన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News