Mahesh Babu Aishwara Rai: మహేష్ బాబు సరసన ఐశ్వర్య రాయ్..? రాజమౌళి సినిమాలో క్రేజీ కాంబినేషన్..

Mahesh Babu Aishwarya Rai Combination: రాజమౌళి-మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్‌ని ఫిక్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 12:24 PM IST
  • మహేష్-రాజమౌళి సినిమాపై క్రేజీ అప్‌డేట్
  • సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాయ్ బచ్చన్..?
  • ఐశ్వర్యతో రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్..
 Mahesh Babu Aishwara Rai: మహేష్ బాబు సరసన ఐశ్వర్య రాయ్..? రాజమౌళి సినిమాలో క్రేజీ కాంబినేషన్..

Mahesh Babu Aishwarya Rai Combination: రాజమౌళి సినిమా అంటేనే భారీతనం ఉట్టిపడుతుంది. క్యాస్టింగ్ దగ్గరి నుంచి మేకింగ్ వరకు అంతా భారీగానే ప్లాన్ చేస్తారు. తెర నిండా భారీ తారాగణం, భారీ సెట్టింగులు, భారీ గ్రాఫిక్స్.. ఇలా అంతా భారీ గానే ఉంటుంది. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాలోనూ రాజమౌళి భారీ తారాగణాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే దర్శకుడు రాజమౌళి ఐశ్వర్య రాయ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సినిమాలో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండటంతో ఆ పాత్రను ఐశ్వర్య రాయ్ లాంటి బిగ్ స్టార్‌తో చేయించాలని రాజమౌళి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే దీనిపై రాజమౌళి నుంచి కానీ చిత్ర యూనిట్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు. ఒకవేళ మహేష్ బాబు-ఐశ్వర్య రాయ్ కాంబో సెట్ అయితే మాత్రం.. వెండితెరపై ఈ ఇద్దరినీ చూడటానికి రెండు కళ్లు చాలవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

నిజానికి ఈ సినిమాలో శ్రద్ధ కపూర్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని రాజమౌళి భావిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ఐశ్వర్య  రాయ్ పేరు తెరపైకి రావడం గమనార్హం. రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే ఈ సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఆఫ్రికా అడవుల్లో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నట్లు గతంలో ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా చేస్తారు. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల డేట్స్‌ను మహేష్ రాజమౌళికే కేటాయించారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. 

Also Read: Petrol Prices: దేశంలో మళ్లీ పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు.. రికార్డ్ హైకి చేరిన క్రూడాయిల్ రేట్ 

 

Also Read: KTR COMMENTS: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం! ఖమ్మం నేతలకు కేటీఆర్ సంకేతం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News