మిమ్మల్ని సతాయిస్తే మస్తుగుంటది కదా : గీత గోవిందం హీరోతో ఎంపీ కవిత

Last Updated : Aug 24, 2018, 03:46 PM IST
మిమ్మల్ని సతాయిస్తే మస్తుగుంటది కదా : గీత గోవిందం హీరోతో ఎంపీ కవిత

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ తాజాగా వచ్చిన గీత గోవిందంతో సినిమానూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాలను అభిమానించే వారి బాజితాలో సాధారణ ఆడియెన్స్ మాత్రమే కాకుండా సినీస రాజకీయ ప్రముఖులు సైతం చేరిపోయారు. ఇప్పటికే గీత గోవిందం సినిమాకు ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద సినీ ప్రముఖులందరి నుంచి ప్రశంసలు రాగా తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా విజయ్ దేవరకొండను, ఆ చిత్ర బృందాన్ని అభినందించారు. తనని కలిసిన చిత్ర యూనిట్ తో కవిత మాట్లాడుతూ.. గీత గోవిందం సినిమాను రెండుసార్లు చూశానని, సినిమా చాలా బాగుందని అన్నారు. చిత్ర యూనిట్ తో సరదాగా ముచ్చటిస్తూ.. మిమ్మల్ని (అబ్బాయిల్ని) సతాయిస్తుంటే మస్తుంటుంది కదా అని అన్నారామె. సినిమాలో విజయ్ దేవరకొండకు నటించిన రష్మిక మందన్న అందులో అతడిని సతాయించిన వైనాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ప‌రశురామ్ ద‌ర్శక‌త్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ రేసులోనూ ఇతర చిత్రాలకన్నా ముందే దూసుకుపోతోంది. దీంతో ఇటీవలే విజయ్ దేవరకొండ ఏర్పాటు చేసిన రౌడీస్ క్లబ్ లో చేరిన ఆయన అభిమానుల ఆనందానికి కూడా హద్దుల్లేకుండా పోయాయి.

Trending News