పూనం కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

పూనం కౌర్ ఫిర్యాదుపై కేసు నమోదు

Last Updated : Apr 18, 2019, 07:20 AM IST
పూనం కౌర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ మరోసారి హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తాను డిప్రెషన్‌లో ఉన్నప్పుడు తన స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడినప్పటి సంభాషణలను రికార్డ్ చేసి ఆ ఆడియో క్లిప్పింగ్స్‌ను యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారని ఆమె సైబర్ క్రైమ్ డీసిపి రఘువీర్‌కి ఫిర్యాదు చేశారు. తన సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ ను లీక్ చేయడం ద్వారా తనకు మానసిక ప్రశాంతత కరువైందని ఆమె తన ఫిర్యాదులో వాపోయారు. 

పూనమ్ కౌర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఆడియో క్లిప్పింగ్స్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిందెవరు అనే కోణంలో విచారణ చేపట్టారు. కోటి, బన్ని రవి అనే ఇద్దరు వ్యక్తులపై పూనమ్ కౌర్ సందేహం వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నేరంలో వారి పాత్ర ఉందా ? ఒకవేళ ఉంటే, వారికి ఆ ఆడియో క్లిప్పింగ్స్ ఎలా దొరికాయనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. 

Trending News