టాలీవుడ్ టాక్: మరో భారీ మూవీకి ప్రభాస్ సన్నాహాలు 

బాహుబలి మూవీతో రెబల్ స్టార్ ప్రభాస్ స్థాయి ఓ రేంజ్ కు వెళ్లిపోయింది.  సాహో లాంటి భారీ బడ్జెట్ తో కూడిన మూవీ ప్రాజెక్టు ప్రభాస్ ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ ప్రాజెక్టుతో బిజీగా గడుపుతున్న ప్రభాస్ కు ఇంతలోనే ముందు మరో భారీ ఆఫర్ వచ్చింది..ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే వివరాల్లో వెళ్లాల్సిందే...

Last Updated : Apr 2, 2019, 05:31 PM IST
టాలీవుడ్ టాక్: మరో భారీ మూవీకి ప్రభాస్ సన్నాహాలు 

సాహో మూవీ ప్రాజెక్టుతో  బీజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవలె ఓ కొత్త ప్రాజెక్టును గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఉంటుందని టాక్. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. కాగా ఇప్పటికే అక్కడ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశారని టాక్

ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం పురాతన ఇటలీ నగరాన్ని ప్రతిబింబించేలా హైదరాబాద్ లోనే ఏకంగా 18 సెట్స్ వేయబోతున్నారు. ఇకపై సినిమా మొత్తాన్ని ఈ సెట్స్ లోనే పూర్తిచేస్తారట. 

సాధారణంగా మేకర్స్ ఎప్పుడైనా నేచురల్ లొకేషన్స్ ఇష్టపడతారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సెట్స్ వేస్తారు. కానీ ఒకే సినిమా కోసం 18 సెట్స్ వేయడం మాత్రం చాలా రేర్. అలాంటి సరికొత్త రికార్డు ప్రభాస్ కొత్త సినిమాతో మొదలుకాబోతోంది.

1940 నాటి ఇటలీ పరిస్థితులు ఆధారంగా తీసున్న ఈ మూవీ తీస్తున్నారు. నాటి ఇటలీ పరిస్థితులు అద్దంపట్టేలా ఉండాలంటే ఈ మూవీ ఘూటింగ్ అక్కడే జరగాలి. కానీ ఘూటింగ్ కోసం ప్రతిసారి ఇటలీ వెళ్లడం కుదరదు. అందుకే ఈ సినిమా కోసం సెట్స్ వేయాలని నిర్ణయించారు. 

Trending News