యాంకర్ రష్మీగౌతం నటించిన అంతకు మించి సినిమాపై కేసు నమోదు !

వివాదంలో యాంకర్ రష్మీగౌతం నటించిన అంతకు మించి సినిమా !

Last Updated : Aug 25, 2018, 02:37 PM IST
యాంకర్ రష్మీగౌతం నటించిన అంతకు మించి సినిమాపై కేసు నమోదు !

బుల్లితెరపై బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని, వెండితెరపై వెలిగిపోదామనే కోరికతో అప్పుడప్పుడు సినిమాలు చేస్తోన్న యాంకర్ రష్మీ గౌతం తాజాగా అంతకు మించి అనే సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించింది. హారర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నిన్ననే థియేటర్లలోకొచ్చింది. అయితే, థియేటర్లలోకొచ్చిన ఈ సినిమాకు రేటింగ్ పరంగా గొప్పగా టాక్ ఏమీ దక్కనప్పటికీ.. తాజాగా ఆర్థికపరమైన వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఈ సినిమా విడుదల నిలిపేసి, చిత్ర నిర్మాతల నుంచి తనకు రావాల్సిన మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా కోరుతూ గౌరీకృష్ణ అనే నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట తన బ్యానర్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ను మధ్యాంతరంగా ఆపేశారని, అప్పటికే తనకు రూ. 50 లక్షల వరకు ఖర్చు వచ్చిందని నిర్మాత గౌరీకృష్ణ తెలిపారు. అయితే, కొత్త నిర్మాతలు సినిమాను ప్రారంభించినప్పుడు తన మొత్తాన్ని తనకు తిరిగిచ్చేస్తానని మాట ఇచ్చినప్పటికీ, ఆ డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదని గౌరీకృష్ణ పోలీసు స్టేషన్ వద్ద మీడియా ఎదుట వాపోయారు.

అంతకు మించి చిత్ర నిర్మాతలు సతీష్, పద్మనాభ రెడ్డి, దర్శకుడు, ఈ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్‌పై ఆయన తన ఫిర్యాదులో ప్రతివాదులుగా పేర్కొన్నాడు. ఈ చిత్ర నిర్మాణం కోసం తాను నష్టపోయిన మొత్తాన్ని తిరిగి తనకు ఇప్పించాల్సిందిగా గౌరీకృష్ణ తన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.

Trending News