కాబోయే బాలీవుడ్ జంటతో కోహ్లీ-అనుష్కల సెల్ఫీ.. వైరల్‌గా మారిన పిక్!

కిందటి వారమే కరీనా కపూర్, కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లి సందడి చేసిన వరుణ్ ధావన్-నటాషా జోడీ తాజాగా అక్కడే ఫారిన్ హాలీడేయింగ్ ఎంజాయ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటను కలిసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్, నటాషాలతో కలిసి సెల్ఫీ తీసుకున్న అనుష్కా శర్మ.. హలో ఫ్రెండ్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ సెల్ఫీని షేర్ చేసుకుంది.

Last Updated : Dec 30, 2019, 03:30 PM IST
కాబోయే బాలీవుడ్ జంటతో కోహ్లీ-అనుష్కల సెల్ఫీ.. వైరల్‌గా మారిన పిక్!

చూడబోతే విదేశీ యాత్రలకు వెళ్లాలనుకునే బాలీవుడ్ ప్రముఖులకు స్విట్జర్లాండ్‌లోని 'గిస్తాడ్' ఫేవరైట్ డెస్టినేషన్‌గా మారినట్టుగా కనిపిస్తోంది. యాధృచ్ఛికంగానే సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్, విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ వంటి పెళ్లయిన దంపతులే కాకుండా పెళ్లి పీటలెక్కనున్న వరుణ్ ధావన్, అతడి గాళ్ ఫ్రెండ్, కాబోయే భార్య నటాషా దలాల్ ఒకేసారి గిస్టాడ్ పర్యటనకు వెళ్లడమే అలా భావించడానికి ఓ కారణమైంది. కిందటి వారమే కరీనా కపూర్, కరిష్మా కపూర్ ఇంటికి వెళ్లి సందడి చేసిన వరుణ్ ధావన్-నటాషా జోడీ తాజాగా అక్కడే ఫారిన్ హాలీడేయింగ్ ఎంజాయ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటను కలిసి సర్‌ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్, నటాషాలతో కలిసి సెల్ఫీ తీసుకున్న అనుష్కా శర్మ.. హలో ఫ్రెండ్స్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ సెల్ఫీని షేర్ చేసుకుంది.



View this post on Instagram


Hello frands 🙋‍♀️ ! @varundvn @natashadalal88

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

అనుష్కా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి దాదాపు 2 మిలియన్ల్ లైక్స్ రాగా 5500లకుపైగా కామెంట్స్ వచ్చాయి. ఫోటో పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఆ పోస్టు వైరల్‌గా మారింది. ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్ రాసిన ఆసక్తికరమైన కామెంట్.. వేల కామెంట్స్‌లోంచి ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా మీరు హిల్ స్టేషన్స్ వెంటపడి ఎందుకు వెళ్తున్నారు.. ఢిల్లీనే ప్రస్తుతం మంచుతో గడ్డకట్టుకుపోతుంది. ఇక్కడికొస్తే.. అందరం చోలే భటురే తింటూ ఎంజాయ్ చేయొచ్చంటూ భువన్ చేసిన కామెంట్ బాగా ఆకట్టుకుంటోంది.

ఇక వరుణ్ ధావన్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, కూలీ నెంబర్ 1 రీమేక్ సినిమాలతో ధావన్ బిజీగా ఉన్నాడు. ఇక అనుష్కా శర్మ విషయానికొస్తే.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌తో కలిసి చేసిన జీరో సినిమా తర్వాత అనుష్కా శర్మ మళ్లీ ఏ ఇతర సినిమాకు సైన్ చేయలేదనే తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య షారుఖ్ ఖాన్, అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన జీరో సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం ఆ చిత్ర యూనిట్‌ని తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే.

Trending News