ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Last Updated : Dec 9, 2018, 10:03 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా కొర్సన రహదారి నెత్తురోడింది. ఆదివారం తెల్ల‌వారుజామున‌ కొర్సనలో సంభవించిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఎదురెదురుగా వచ్చిన ఓ స్టీరింగ్ ఆటో, మరో వాహనం ఒకదానినొకటి పరస్పరం ఢీ  కొనడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం అందుతోంది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  

Trending News