జమ్ముకశ్మీర్ నుంచి ఆగ్రా జైలుకు 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరలింపు

జమ్ముకశ్మీర్ నుంచి ఆగ్రా జైలుకు 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరలింపు

Last Updated : Aug 9, 2019, 02:27 PM IST
జమ్ముకశ్మీర్ నుంచి ఆగ్రా జైలుకు 70 మంది ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరలింపు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారనగా అంతకన్నా ముందుగా జమ్మూకాశ్మీరు నుంచి 70 మంది ఉగ్రవాదులు, పాకిస్తాన్‌ సానుభూతిపరులైన వేర్పాటువాదులను ఆగ్రాలోని జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. భారత వాయు సేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఉగ్రవాదులు, వేర్పాటువాదులను జమ్మూ-కశ్మీరు నుంచి ఆగ్రాలోని జైలుకు తరలించినట్టు సమాచారం అందుతోంది. 

జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం చోటుచేసుకున్న ఈ కీలక పరిణామం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Trending News