ప్రయాణీకులకు ఎయిర్‌ఏసియా బంపరాఫర్

ఎయిర్‌ఏసియా ఇండియా ‘బిగ్ సేల్‌’ ఆఫర్‌ను ప్రకటించింది.

Last Updated : Sep 4, 2018, 08:57 AM IST
ప్రయాణీకులకు ఎయిర్‌ఏసియా బంపరాఫర్

ఎయిర్‌ఏసియా ఇండియా ‘బిగ్ సేల్‌’ ఆఫర్‌ను ప్రకటించింది. విమాన ప్రయాణీకులకు పరిమిత కాలానికి డిస్కౌంట్ ధరలపై టికెట్లు అందిస్తున్నట్లు ఎయిర్‌ఏసియా ప్రకటించింది.ఈ ఆఫర్‌ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.999కే అందించనున్నట్టు పేర్కొంది. బెంగళూరు, గౌహతి, చెన్నై, ఇంఫాల్, కొచ్చిన్ మార్గాలకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్‌సైట్‌ ఎయిర్‌ఏసియా.కామ్‌లో వెల్లడించింది.

బిగ్ సేల్‌ కింద గౌహతి-ఇంఫాల్, బెంగళూరు-కొచ్చిన్, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.999కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్‌ఏసియా ఇండియా తెలిపింది. సెప్టెంబర్ 3 నుండి సెప్టెంబర్ 9 వరకు రూ.999కే ఈ మార్గాల్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చని, అలా బుక్ చేసుకున్న టికెట్లతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. ఎయిర్‌లైన్‌ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్‌ఏసియా ఇండియా ఈ బిగ్ సేల్‌ను ప్రారంభించింది.  

బిగ్ సేల్‌ కింద టిక్కెట్లను అడ్వాన్స్‌గా బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు www.airasia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి. ఈ ఆఫర్‌ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్‌ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్‌ జర్నీకి మాత్రమే. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్‌ఏసియా తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తమకు ప్రయాణీకుల సంఖ్య 22 శాతం పెరిగినట్లు ఈ సంస్థ ప్రకటించింది.

 

 

 

Trending News