రూ.1399కే విమాన టికెట్లు: ఎయిర్ ఏషియా

పలు ఎంపిక చేసిన రూట్లలో ఎయిర్ ఏసియా తక్కువ ధర విమాన టికెట్లు అందిస్తోంది.

Last Updated : Apr 7, 2018, 04:13 PM IST
రూ.1399కే విమాన టికెట్లు: ఎయిర్ ఏషియా

పలు ఎంపిక చేసిన రూట్లలో ఎయిర్ ఏషియా తక్కువ ధర విమాన టికెట్లు అందిస్తోంది. రూ.1399కే విమాన టికెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ ఏషియా యాజమాన్యం తెలిపింది. భువనేశ్వర్-కోల్కతా, రాంచీ-కోల్కతా, కొచ్చి-బెంగళూరు, కోల్కతా-భువనేశ్వర్, కోల్కతా-రాంచీ, గౌహతీ-ఇంఫాల్, హైదరాబాద్-బెంగళూరు, ఇంఫాల్-గౌహతీ, బెంగళూరు-చెన్నైతో పాటు పలు రూట్లలో ఈ టికెట్లు లభిస్తున్నాయి. ఏప్రిల్ 15 వరకు బుక్ చేసుకునే ఈ టికెట్లతో ఏప్రిల్ 2 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చు. మరిన్ని వివరాల కోసం airasia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడవచ్చు.

airasia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. అయితే ఈ ధరలు వన్-వేకి మాత్రమే వర్తిస్తాయి అని అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది ఎయిర్ ఏషియా. ఎయిర్ పోర్ట్ టాక్స్‌లన్నీ కలుపుకొని ఈ టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు. అయితే సీట్లు పరిమితమని.. అన్ని విమానాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉండవని.. కొత్త కొనుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొన్నారు. క్రెడిట్ / డెబిట్ / ఛార్జ్ కార్డుల ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది. ఒక్కసారి పేమెంట్ అయ్యాక తిరిగి రిఫండ్ కాదని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. కాగా.. దేశీయ ప్రయాణీకుల రద్దీ 24 శాతం కన్నా ఎక్కువగా పెరిగి ఫిబ్రవరి 2018 నాటికి 1.07 కోట్లకు చేరుకుందని డిజిసిఎ గతనెలలో ఓ ప్రకటనలో పేర్కొంది.

 

Trending News