జియో కొత్త ప్రయోగం.. రూ.1500 కే స్మార్ట్ ఫోన్

భారతీయ టెలికాం దిగ్గజం జియో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది.

Last Updated : Feb 1, 2018, 01:24 PM IST
జియో కొత్త ప్రయోగం.. రూ.1500 కే స్మార్ట్ ఫోన్

భారతీయ టెలికాం దిగ్గజం జియో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే 4జీ వీవో ఎల్‌టీఈ ఫీచర్‌ ఫోన్‌‌ను విడుదల చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు తక్కువ ధరకే జియో సిమ్ కార్డుతో సహా స్మార్ట్ ఫోన్ తీసుకురావడానికి సంకల్పించింది. ఈ మేరకు మీడియా టెక్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే పలు కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చినప్పటికీ.. వాటన్నింటి కంటే జియో ప్రస్తుతం విడుదల చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఖరీదే తక్కువ అని ఆ సంస్థ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పెట్టి.. రూ.1500 కే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే ఎంఆర్పీ రూ.1500 రేటుకే తొలిసారిగా తాము స్మార్ట్ ఫోన్ ఇచ్చేలా చూస్తున్నామని జియో సంస్థకి చెందిన పలువురు తెలపడం గమనార్హం.

Trending News