భారత్‌లో 24వేలు దాటిన కరోనా మరణాలు

CoronaVirus Cases In India | భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఆందోళన పెంచుతున్నాయి. ఓ వైపు రికవరీ రేటు స్థిరంగా ఉన్నప్పటికీ కరోనా మరణాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు కనీసం అయిదు వందల మందిని కోవిడ్ మహమ్మారి పొట్టన పెట్టుకుంటోంది.

Last Updated : Jul 15, 2020, 09:57 AM IST
భారత్‌లో 24వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్ (CoronaVirus In India) ఉధృతి కొనసాగుతోంది. నిత్యం కేసులతో పాటు కరోనా మరణాలు సైతం భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 29, 429 కరోనా పాజిటివ్ కేసుల్ని నిర్ధారించారు. అదే సమయంలో 582 మంది కరోనాతో మరణించారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య (India COVID19 Cases) 9,36,181కు చేరింది. ఆర్టీసీ బస్సెక్కిన కరోనా పేషెంట్.. ఆ జిల్లాలో టెన్షన్ టెన్షన్

దేశంలో ఇప్పటివరకూ కోవిడ్19 మహమ్మారి బారిన పడి 24,309 మంది మరణించారు. భారత్‌లో నమోదైన మొత్తం కేసులకుగానూ చికిత్స తర్వాత 5,92,032 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 3,19,840 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా పేషెంట్ల రికవరీ రేటు 63.20 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమమంత్రిత్వ శాఖ తెలిపింది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News