India Covid-19: కరోనాతో గత 24గంటల్లో 312 మంది మృతి

దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా 24వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

Last Updated : Dec 24, 2020, 10:24 AM IST
India Covid-19: కరోనాతో గత 24గంటల్లో 312 మంది మృతి

India Coronavirus Cases Updates | న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా 24వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో బుధవారం (డిసెంబరు 23న) కొత్తగా 24,712 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 312 మంది మరణించారు. ఈ గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,23,778 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,46,756 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కేసులతోపాటు కరోనా (Coronavirus) నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా నిత్యం గణనీయంగా పెరుగుతోంది. బుధవారం కరోనా నుంచి 29,791 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 96,93,173 కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌గా (active cases) 2,83,849 కరోనా కేసులు ఉన్నాయి. Also Read: CoviShield: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు వచ్చే వారం అనుమతులు!

ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 10,39,645 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి డిసెంబరు 23వ తేదీ వరకు మొత్తం 16,53,08,366 నమూనాలను పరీక్షించినట్లు (samples tested) ఐసీఎంఆర్ వెల్లడించింది.

Also Read: PM Kisan Samman Nidhi: రైతులకు తీపి కబురు.. 25న జమకానున్న కేంద్ర సాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News