Covid Medicine: కోవిడ్‌కు మందు వచ్చేసింది..అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఐ

Covid Medicine: కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగేసింది. కరోనా వైరస్‌కు కనిపెట్టిన మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2021, 05:32 PM IST
  • కోవిడ్‌కు సరికొత్త మందు, అత్యవసర అనుమతిచ్చిన డీజీసీఐ
  • డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్త తయారీ
  • గ్లూకోజ్‌ రూపంలో రానున్న 2-డియోక్సీ-డి-గ్లూకోజ్
Covid Medicine: కోవిడ్‌కు మందు వచ్చేసింది..అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఐ

Covid Medicine: కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగేసింది. కరోనా వైరస్‌కు కనిపెట్టిన మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది.

కరోనా మహమ్మారిని (Corona Virus) అంతం చేసేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డీఆర్డీవో(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys Labs) సంయుక్తంగా ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్  ల్యాబ్‌లో యాంటీ కరోనా డ్రగ్‌ను అభివృద్ధి చేశాయి.ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ ల్యాబొరేటరీలో తయారైన ఈ మందు క్లినికల్ ట్రయల్స్ (Clinical trials) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ 2 డియోక్సీ డి గ్లూకోజ్( Covid 2 Deoxy De Glucose) మందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులకు ఈ మందు అమోఘంగా పనిచేస్తోందని..వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని డీఆర్డీవో తెలిపింది.

ఈ మందు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. దేశంలో దీన్ని సులభంగా ఉత్పత్తి చేయడంతో పాటు విరివిగా అందుబాటులో తీసుకురావచ్చని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys labs) చెబుతోంది. ఈ మందు సాచెట్లలో పొడిరూపంలో లభించనుంది. నీటిలో కరిగించి నోటితో తీసుకోవాలి. వైరస్ వ్యాపించిన భాగాల్లో చేరి అక్కడి సెల్స్‌లో ఉన్న కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు విస్తరణను గణనీయంగా తగ్గిస్తుంది. ఐఎన్ఎంఏఎస్ - డీఆర్డీవో శాస్త్రవేత్తలు సీసీఎంబీ (CCMB)సహాయంతో చేసిన ప్రయోగాల్లో వైరస్‌కు వ్యతిరేకంగా ఈ మందు సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. 2020 డిసెంబర్-2021 మార్చ్  మధ్య కాలంలో 220 మంది రోగులపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్‌లకు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా డీజీసీఐ (DGCI) అనుమతిచ్చింది.

Also read: Vaccine for Children: కోవిడ్ ఉధృతి నేపధ్యంలో చిన్నారులకు కూడా వ్యాక్సిన్ అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News