ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో అగ్ని ప్రమాదం!

ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో అగ్ని ప్రమాదం!

Last Updated : Mar 6, 2019, 06:08 PM IST
ఢిల్లీలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో అగ్ని ప్రమాదం!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రగతి విహార్‌లో వున్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సీజీఒ కాంప్లెక్స్‌లోని 11 అంతస్తుల పండిట్ దీన్‌దయాల్ అంత్యోదయ భవన్‌లోని 5వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన 24 అగ్నిమాపక యంత్రాలతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 

జనవరి 12న ఇదే సముదాయంలోని బి బ్లాక్ మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే.

Trending News