అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత ప్రధానిని దొంగ అన్నారు : రాహుల్ గాంధీ

రఫెల్ డీల్‌పై మళ్లీ ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ 

Last Updated : Dec 1, 2018, 03:52 PM IST
అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత ప్రధానిని దొంగ అన్నారు : రాహుల్ గాంధీ

జైపూర్: నిన్నమొన్నటివరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు రాజస్థాన్‌లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం రాజస్థాన్ లోని చిత్తూర్‌ఘర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. రాజస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం భారీ అవినీతికి పాల్పడుతోందని, అందుకే ఎయిర్ ఫోర్స్ లోంచి రూ.30,000 నిధులు దోచి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబాని జేబులో వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత ప్రధానిని ఒక దొంగ అని సంబోధించే దుస్థితి తలెత్తిందని ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.

Trending News