Assembly Election Results 2022 LIVE*: యూపీలో విజయం దిశగా బీజేపీ- రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

Assembly Election Results 2022 LIVE: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 04:09 PM IST
Assembly Election Results 2022 LIVE*: యూపీలో విజయం దిశగా బీజేపీ- రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
Live Blog

Assembly Election Results 2022 LIVE: ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​, ఉత్తరాఖండ్​, మణిపూర్​, గోవాలో ఇటీవల మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగాయి. 7వ తేదీగనా యూపీలో తుది విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల మధ్యే కౌంటింగ్​ జరుగుతోందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. భౌతికదూరం పాటించడం, మాస్క్​ పెట్టుకోవడం, శానిటైజర్​ వాడటం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని కౌంటింగ్ సిబ్బందికి స్పష్టం చేసినట్లు వివరించింది.

ముందుగా పోస్టల్​ బ్యాలెట్​లలోని ఓట్ల లెక్కింపు జరుగుతుందని.. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లు లెక్కిస్తారని ఈసీ వివరించింది.

ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల్లో ఉత్తర్​ ప్రదేశ్​, పంజాబ్​పైనే అందరి దృష్టి ఉంది. ఈ రాష్ట్రాలు దేశ రాజకీయాలకు కీలకంగా ఉండటమే ఇందుకు కారణం. ఎగ్జిట్​ పోల్స్​లో యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడగా.. పంజాబ్​లో అధికారం చేతులు మారటం ఖాయం అని సర్వేలు అంచాలు ఉన్నాయి.

10 March, 2022

  • 16:08 PM

    ముఖ్యమంత్రి పరాజయం..

    ఉత్తరాఖండ్​లో విజయం దిశగా దూసుకెళ్తున్న బీజేపీకి చుక్కెదురైంది. ఆ రాష్ట్ర సీఎం (బీజేపీ) పుష్కర్​ సింగ్ ధామీ.. ఎన్నికల్లో ఓడిపోయారు. ఖటిమా నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలైనట్లు ఈసీ డేటాలో తేలింది.

  • 15:30 PM

    ఇక పంజాబ్​లోను ఆప్ సర్కార్​..

    పంజాబ్​లో ఫలితం తేలిపోయింది. ఆప్​ అధికారంలోకి రానుంది.

    ఇప్పటికే రాష్ట్రంలో 66 సీట్లు సొంతం చేసుకుంది ఆప్​. పంజాబ్​లో మ్యాజిక్ ఫిగర్​ 59 కావడం గమనార్హం. ఇవే కాకుండా మరో 28 స్థానాల్లో ఆధిక్యంతో క్లీన్​ స్వీప్​ చేసే దిశగా ఓటింగ్ సరళి సాగుతోంది.

  • 14:52 PM

    పంజాబ్​ సీఎం, పీసీసీ చీఫ్​ ఓటమి..

    పంజాబ్​లో ఆప్​ జోరుకు.. ప్రత్యర్థి పార్టీలు విల విల లాడుతున్నాయి. కాంగ్రెస్ కీలక నేతలు సైతం ఓటమిపాలవుతున్నారు. సీఎం చరణ్ జిత్​ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి.. ఓటమిపాలయ్యారు. ఇక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్ సిద్ధూ సైతం ఓడిపోయారు.
     

  • 14:36 PM

    యూపీలో బీజేపీ సంబరాలు..

    యూపీలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖరారైది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. బీజేపీ మొదటి నుంచి మ్యాజిక్ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో ఉంది.

    దీనితో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్​ కూడా విజయోత్సవాలు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • 14:36 PM

    యూపీలో బీజేపీ సంబరాలు..

    యూపీలో బీజేపీ మరోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖరారైది. ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే.. బీజేపీ మొదటి నుంచి మ్యాజిక్ ఫిగర్​ను దాటి ఆధిక్యంలో ఉంది.

    దీనితో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్​ కూడా విజయోత్సవాలు జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

  • 14:20 PM

    సోనూ సూద్ సోదరి ఓటమి..

    పంజాబ్​లో నటుడు సోనూ సూద్​ సోదరి..మాళవిక సూద్​ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్​ పార్టీ తరఫున.. మోగా స్థానానికి పోటీ చేశారు మాళవికా. ఆప్​ అభ్యర్థి అమన్​దీప్​ కౌర్​ చేతిలో ఓటమిపాలయ్యారు.

  • 13:42 PM

    యూపీలో బీజేపీ జోరు..

    యూపీల బీజేపీ జోరు కొనసాగుతోంది. ఈసీ డేటా ప్రకారం.. ఒక్క ఫలితం కూడా రాలేదు. అయితే 249 స్థానాల్లో బీజేపీ లీడ్​లో ఉన్నట్లు తెలిసింది. ఎస్​పీ 122 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

    ఇక కాంగ్రెస్​, బీఎస్​పీలు చెరో 2 స్థానాల్లో మాత్రమే లీడ్​లో ఉన్నాయి.. 

    మొత్తం 403 స్థానాలకు గాను... 202 స్థానాల్లో గెలిస్తే యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలుంది. అంటే ఈ లెక్కన బీజేపీ మ్యాజిక్ ఫిగర్​ కన్నా చాలా సీట్లు ఆధిక్యంలో ఉంది. దీనితో మరోసారి యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమైంది.
     

  • 13:34 PM

    భగవంత్ మాన్​ విజయం..

    పంజాబ్​లో ఆప్​ దూసుకెళ్తోంది. సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​ విజయం సాధించారు. ధురి నుంచి ఆయన విజయ ఢంకా మోగించారు. ఇక పజాబ్ సీఎం చరణ్​జిత్ సింగ్ మాత్రం రెండ స్థానాల్లో వెనకంజలో ఉన్నారు.

  • 13:13 PM

    గోవాలో అధికారం చేపడతాం..

    గోవాలో మరోమారు అధికారం చేపట్టనున్నట్లు చెప్పారు ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్​ (బీజేపీ). స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టుకుని అధికారం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే గోవాలో బీజేపీ విజయోత్సవాలు జరుపుకుంటోంది.

    ప్రస్తుతం గోవాలో 19 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. గోవాలో మ్యాజిక్ ఫిగర్ 21. కాగా ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు లీడ్​లో ఉన్నారు.
     

  • 13:03 PM

    అరవింద్ కేజ్రివాల్ హర్షం.. ఓటమిని అంగీకరించిన సిద్దూ..

    పంజాబ్​లో ఫలితాలపై పార్టీల కీలక నేతలు స్పందిస్తున్నారు.. విప్లవాత్మక విజయాన్ని అందించిన పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రివాల్​ ట్వీట్​ చేశారు.

    ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లు పంజాబ్ పీసీసీ చీఫ్​ నవజోత్​ సింగ్ సిద్దూ ట్విట్టర్​ ద్వారా తెలిపారుడ. విజయం దిశగా దూసుకుపోతున్న ఆప్​కు శుభాకాంక్షలు తెలిపారు సిద్ధూ.

    ఇక ఇదిలా ఉండగా.. కెప్టెన్ అమరిందర్ సింగ్ (పంజాబ్​ మాజీ సీఎం) ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పటియాలా నుంచి ఆయన పోటీ చేసిన విషయం తెలిసింది.

     

  • 12:19 PM

    పంజాబ్​లో ఫలితాలు..

    పంజాబ్​లో ఫలితాలు వెలువడుతున్నాయి. రెండు స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది ఈసీ.

    పఠాన్​కోట్​లో బీజేపీ అభ్యర్థి అశ్విని కుమార్​ శర్మ విజయం సాధించారు.

    కపుర్తలాలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్జిత్​ సింగ్ గెలుపొందారు.

  • 11:58 AM

    ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్: యూపీలో మొదలైన బీజేపీ సంబరాలు.. 

    గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి 12,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్  

     

  • 11:48 AM

    నాలుగు రాష్ట్రాల్లో ఆధిక్యంలో బీజేపీ 
    ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు కనిపిస్తుంది. పంజాబ్ మినహా.. ఉత్తర్ ప్రదేశ్​లో 276 స్థానాల్లో, ఉత్తరాఖండ్​లో 45 స్థానాల్లో, మణిపూర్​లో 26 స్థానాల్లో, గోవాలో 17 స్థానాల్లో లీడ్​లో ఉంది. 

    పంజాబ్​లో కాంగ్రెస్ కు కోలుకోని దెబ్బ తగిలేలా ఉందని చెప్పాలి. ఆ రాష్ట్రంలో ఆప్ 44 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. 
     

  • 11:30 AM

    ఉత్తరాఖండ్ ట్రెండ్స్: ఉత్తరాఖండ్ లో మెజారిటీ మార్కును దాటేసిన బిజెపి.. మొత్తం 70 స్థానాల్లో బిజెపి 44 స్థానాల్లో ఆధిక్యం ఉండగా.. కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
     

  • 11:26 AM

    ఐదింట నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు..

    పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరు కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్​లో 258 స్థానాల్లో, ఉత్తరాఖండ్​లో 45 స్థానాల్లో, మణిపూర్​లో 25 స్థానాల్లో, గోవాలో 18 స్థానాల్లో లీడ్​లో ఉంది.

    పంజాబ్​లో మాత్రం ఆప్​ దూసుకెళ్తోంది. 88 స్థానాల్లో లీడ్​లో ఉంది.

    అయితే ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్​కు ఓటమి తప్పేలా లేదని ప్రస్తుత ట్రెండ్స్ చెబుతున్నాయి. పంజాబ్​ వంటి కీలక రాష్ట్రం కూడా కాంగ్రెస్​ చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • 11:09 AM

    గోవా పోల్ ట్రెండ్స్: గోవా సగం స్థానాల్లో లీడ్ లో ఉన్న బీజేపీ... ఆధిక్యంలో ఉన్న సీఎం ప్రమోద్ సావంత్ 

     

  • 10:53 AM

    పంజాబ్ ట్రెండ్స్: పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాలకు.. AAP 89 స్థానాల్లో, కాంగ్రెస్ 12 స్థానాల్లో మరియు BJP 5 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

     

  • 10:49 AM

    Assembly Election Results 2022 : మణిపూర్ లో బీజేపీ 9 అసెంబ్లీ స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో ఆధిక్యం 

     

  • 10:20 AM

    మణిపూర్​ ట్రెండ్​..

    మణిపూర్​లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వస్తోంది. 12 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

    కాంగ్రెస్​ 5 సీట్లలో, జేడీ(యూ) 4 స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.

  • 10:17 AM

    గోవాలో బీజేపీ లీడ్​..

    గోవాలో బీజేపీ లీడ్​ కొనసాగుతోంది. 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 13 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎంజీపీ 5, ఆప్​ ఒక స్థానంలో లీడ్​లో ఉన్నట్లు ఎలక్షన్​ కమిషన్ డేటాలో వెల్లడైంది.

  • 09:56 AM

    పంజాబ్​లో ఆప్​ జోరు..

    పంజాబ్​లో ఆప్​ జోరు కొనసాగుతోంది. మొత్తం 117 స్థానాలు ఉండగా.. 66 స్థానాల్లో ఆప్​ లీడ్​లో దూసుకెళ్తోంది.

    కాగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. 59 స్థానాలు అవసరం. విజయం దిశగా ఆప్​ దూసుకెళ్తున్న నేపథ్యంలో పంజాబ్​ ఆప్​ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్​ మాన్ ఇంటి వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరి సంబరాలు జరుపుకుంటున్నారు.

  • 09:27 AM

    లీడ్​లో ఆప్​..

    పంజాబ్​లో అమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) లీడ్​లోకి వచ్చింది. 117 స్థానాలకు గానూ 6 చోట్ల ఆప్​, రెండు చోట్ల శిరోమణి  అకాలీ దళ్​​, బీజేపీ ఒకచోట ఆధిక్యంలో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్​ డేటాలో తేలింది.

  • 09:10 AM

    రాష్ట్రాల వారీగా ట్రెండ్

    ఉత్తర్​ ప్రదేశ్​లో  బీజేపీ ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ సహా పలువురు కీలక అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

    పంజాబ్​లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పంజాబ్​ సీఎం చరణ్​జిత్ సింగ్ చన్నీ సహా పలువురు గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

    ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్​లలో ఆధిక్యం విషయంలో పోటా పోటీ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య పోటీ కనిపిస్తోంది.

  • 09:02 AM

    బీజేపీ జోరు..

    ఉత్తరాఖండ్​లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 70లో 62 స్థానాలకు సంబంధించి ట్రెండ్​ను పరిశీలిస్తే.. బీజీపీ 36 స్థానాల్లో బీజేపీ ఆధిపత్యం కొనసాగుతోంది.

    కాంగ్రెస్​ 22 స్థానాల్లో, ఆప్​ 1 స్థానంలో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 08:53 AM

    రాష్ట్రాల వారీగా మ్యాజిక్ ఫిగర్స్​..

    • ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ ఉన్నాయి. విజయానికి కావాల్సింది 202 సీట్లు.
    • పంజాబ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 117 ఉండగా.. గెలిపుకోసం కనీసం 59 సీట్లు రావాల్సి ఉంటుంది.
    • ఉత్తరాఖండ్​లో మ్యాజిక్ ఫిగర్​ 36 సీట్లు. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 70.
    • గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 21 స్థానాలు గెలుచుకున్న పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుది.
    • మణిపూర్​లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 31 స్థానాలు గెలిస్తే అధికారం దక్కుతుంది.

Trending News