నేడే ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్

నేడే ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్

Last Updated : Apr 26, 2019, 09:32 AM IST
నేడే ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్

వారణాసి లోక్ సభ స్థానం నుంచి లోక్ సభ ఎన్నికలకు పోటీచేస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ నేడు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకన్నా ముందుగా వారణాసిలోని కాల బైరవుడి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరపనున్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆలయానికి వెళ్లి, అక్కడ 15 నిమిషాలపాటు పూజలు జరిపిన అనంతరం 11:30 గంటలకు మోదీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపి, ఎన్డీఏ, ఎన్ఇడిఏ(నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్) నేతల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత 12:30 గంటలకు తాజ్ హోటల్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపి) మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేస్తోన్న వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అజయ్ రాయ్‌ని బరిలోకి దింపింది.

Trending News