హస్తకళను ప్రమోట్ చేసే వండర్ ఫుల్ టెక్నిక్ మోడీకి మాత్రమే తెలుసు !!

మోడీ వద్ద హస్తకళను ప్రమోట్ చేసే వండర్‌ఫుల్ టెక్నిక్

Last Updated : Oct 29, 2018, 06:55 PM IST
హస్తకళను ప్రమోట్ చేసే వండర్ ఫుల్ టెక్నిక్ మోడీకి మాత్రమే తెలుసు !!

టోక్యో: జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని మోదీ విలువైన బహుమతులు అందజేశారు. ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లిన సందర్భంలో మోడీ ఆ దేశ ప్రధాని షింజో అబేను కలుసుకున్నారు. ఈ సందర్భంలో  ప్రధాని మోడీ ఈ మేరకు బహుమతి ప్రదానం చేశారు. కాగా మోడీ ఇచ్చిన విలువైన గిఫ్ట్ కు షింజో అబే సంతోషం వ్యక్తం చేశారు. 

ఇంతకీ మోడీ ఇచ్చి గిఫ్ట్ ఏంటీ ? 

రాజస్థాన్‌లో రోజ్ క్వార్జ్, యెల్లో క్వార్జ్‌తో తయారు చేసిన రాతి పాత్రలతో పాటు ఉత్తరప్రదేశ్ చేనేత కళాకారులు నేసిన ధురీస్‌ను అందజేశారు. అంతేకాకుండా జోధ్‌పురి సంప్రదాయ పనితీరు ఉట్టిపడే చెక్కపెట్టెను బహుకరించారు. కాగా షింజో అబేకు అందజేసిన ఈ బహుమతులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ పర్యవేక్షణలో తయారు చేయడం విశేషం.

ఆ చిన్న చిట్కాతో బోలెడు ప్రయోజనాలు

వాస్తవానికి భారత ప్రధాని మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా బహుమతులను అందజేస్తుంటారు. కారణం భారత హస్తకళలను ప్రమోట్ చేసేందుకేనట.. భారతదేశం హస్తకళలకు ప్రసిద్ధి అని ప్రపంచానికి చాటి చెప్పేందుకే ఈ మేరకు మోడీ బహుమతులు ఇస్తుంటారట. చిన్న ఐడీయా జీవితాన్ని మార్చినట్లు..చిన్న చిట్కాతో భారత హస్తకళ నైపుణ్యం ప్రపంచానికి చాటిచెబుతున్నారు మన భారత ప్రధాని......... మోడీనా మజాకా...!!

Trending News