ఓటు వేయవద్దని.. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన అధ్యాపకులు

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయరాదని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఆ ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు.

Last Updated : Jan 28, 2018, 03:06 PM IST
ఓటు వేయవద్దని.. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన అధ్యాపకులు

రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయరాదని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఆ ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు. వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్‌లో తొలిసారిగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్‌లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయాలని సంకల్పించారు విజయలక్ష్మీ ఇండిస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు. అందుకు విద్యార్థుల మద్దతు కూడా తీసుకొని.. ఆ విధానాన్ని రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బిజేపీకి ఓటు వేసేది లేదని చెబుతూ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు అధ్యాపకులు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులందరూ వరుసగా నిల్చొని ఇలా ప్రతిజ్ఞ చేయడాన్ని కొందరు ప్రశంసించగా.. కొందరు వారి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

Trending News