Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మృతి

Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ చరియలు భారీగా విరిగిపడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. గత పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండవసారి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 25, 2021, 05:27 PM IST
Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగిపడి 9 మంది మృతి

Rockslide: హిమాచల్‌ప్రదేశ్‌లో మరోసారి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండ చరియలు భారీగా విరిగిపడటంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. గత పదిహేను రోజుల వ్యవధిలో ఇది రెండవసారి.

హిమాచల్‌ప్రదేశ్‌లోని (Himachal pradesh)కిన్నౌర్ జిల్లా సంగాల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఎగువన కొండపై నుంచి భారీగా బండరాళ్లు దొర్లుకురావడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. కొండరాళ్లు విరిగిపడటంతో 9 మంది మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బండరాళ్లు ధాటికి సమీపంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. అక్కడే పార్క్ చేసి ఉన్న వాహనాలు, రెస్ట్‌రూమ్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన అంతా వీడియోలో రికార్డవడంతో వైరస్ అవుతోంది. మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా భారీ వర్షాల కారణంగా కొండ చరియలు (Rockslide) విరిగిపడ్డాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలకు వెళ్లవద్దని పర్యాటకులకు సూచిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించిన కొద్దిరోజులకే ఈ ప్రమాదం జరిగింది. భారీ వరదల్లో కూడా 13 మంది మరణించారు.

Also read: EPF Interest Rate: ఈపీఎఫ్ కస్టమర్లకు శుభవార్త, వడ్డీ డబ్బులు మరో వారం రోజుల్లో జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News