TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
TTD Good News To Devotees: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుపతి లడ్డూపై వస్తున్న పుకార్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. లడ్డూల కొరత లేదని భక్తులకు అవసరమైనన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
TTD News: ఇటీవల తిరుమలలో ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ఈవో శ్యామల్ రావు తనదైన స్టైల్ లో హల్ చల్ చేస్తున్నారు. తిరుమలలో గాడితప్పిన అనేక అంశాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు.
శ్రీవారి ప్రసాదానికి లైసెన్స్ ఉండాల్సిందేనని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా టీటీడీతో పాటు చంద్రబాబు సర్కార్కు సూచనలు జారీ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త శ్రీవారి లడ్డు నాణ్యతపై పిటిషన్ దాఖలు చేశారు. రోజుకు కొన్ని వేల మంది ప్రసాదం తీసుకుంటారని ..అలాంటి ప్రసాదంలో నాణ్యత లేకపోతే అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని ..ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి లడ్డుకు లైసెన్స్ జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ దాఖలుతో ఎఫ్ఎస్ఎస్ఎస్ఏ ఈ మేరకు స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.