ఫొని తుపాన్: భారీ వర్షాలకు ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

ఫొని తుపాన్: భారీ వర్షాలకు ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

Last Updated : May 3, 2019, 02:59 PM IST
ఫొని తుపాన్: భారీ వర్షాలకు ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల వాసుల బతుకులను ఫొని తుపాన్ అస్తవ్యస్తం చేసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైనా ఫొని తుఫాన్ ప్రభావం అధికంగానే కనిపించింది. ఫొని తుపాన్ ఒడిషాలోని పూరి జల్లాను ఆనుకుని వున్న తీర ప్రాంతం వద్ద నేటి ఉదయం తీరం దాటింది. ఈ తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు, గాలి భీబత్సానికి ఒడిషాలో ముగ్గురు మృతి చెందగా మరొకరు గాయపడ్డారని వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

Trending News