పుల్వామాలో ఎన్‌కౌంటర్ ; ఇద్దరు ఉగ్రవాదులు హతం

పుల్వామా సెక్టారలో యాన్డీ టెర్రరిస్ట్ ఆపరేషన్  కొనసాగుతోంది

Last Updated : Mar 5, 2019, 02:06 PM IST
పుల్వామాలో ఎన్‌కౌంటర్ ; ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్ : పుల్వామాలో సైన్యం నిర్వహిస్తున్న యాన్టీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం ట్రాల్ దగ్గర భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా దాడిలో భారత జవాన్లను మట్టుబెట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా కన్నేసిన భారత సైన్యం ఉగ్రవాదులను వెంటాడి మట్టుబడుతున్నారు. ఈ క్రమంలో  మంగళవారం భద్రతా బలగాలు ఈ మేరకు ఉగ్రవాదలను మట్టుబెట్టాయి.

పుల్వామాలో ట్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ పరిసర ప్రాంతాలపై గట్టి నిఘా పెట్టిన సైన్యం  ఉగ్రవాదుల కదలికను గమనిస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో ఉగ్రమూలక ముఠా ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రమూలు హతమయ్యారు.

ఇదిలా ఉండగా ఉగ్రవాదులు - భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆపరేషన్ పూర్తయ్యే లోపు మరింత మంది ఉగ్రమూలను మట్టుబెట్టాలనే లక్ష్యంతో భద్రతా బలగాలు ఉన్నాయి.

 

Trending News