పద్మావతి చిత్రానికి రెడ్ సిగ్నల్ ఇచ్చిన యూపీ సర్కార్

          

Last Updated : Nov 16, 2017, 01:09 PM IST
    • 'పద్మావతి' పరిశీలించాకే తుది నిర్ణయం
    • విడుదలైతే శాంతిభద్రతలకు విఘాతం
    • యూపీ ప్రభత్వం కేంద్రానికి లేఖ
పద్మావతి చిత్రానికి రెడ్ సిగ్నల్ ఇచ్చిన యూపీ సర్కార్

'పద్మావతి చిత్రం' పై రగడ రోజురోజుకూ రాజుకుంటోంది. తాజాగా ఈ చిత్రంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గురువారం లేఖ రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న పద్మావతి సినిమాకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు తెలిపింది. సెన్సార్ బోర్డు పరిశీలించాకే తుది నిర్ణయం వెల్లడించాలని కోరింది. సినిమా విడుదల కాక ముందే ప్రజలు అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని.. విడుదలైతే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారి లేఖలో తెలిపారు. సినిమా విడుదలైతే థియేటర్లు తగులబెడుతతాం అని కూడా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ నెలాఖరులో ఉత్తరప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 1న ప్రకటిస్తారు. సినిమా కూడా డిసెంబర్1 నే విడుదలువుతుంది. ఇలాంటి కీలక సమయంలో శాంతిభద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉంది అని స్పష్టంగా పేర్కొన్నారు హోం శాఖ అధికారి అరవింద్ కుమార్.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x