బ్రేకింగ్ న్యూస్: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది సైనికులు మృతి!

బ్రేకింగ్ న్యూస్: ఉగ్రదాడిలో 30 మంది సైనికులు మృతి

Last Updated : Feb 15, 2019, 11:29 AM IST
బ్రేకింగ్ న్యూస్: సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 30 మంది సైనికులు మృతి!

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. సెంట్రల్ రిజర్వ్ డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) కాన్వాయ్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. తన కారుతో కాన్వాయ్‌పైకి దూసుకుపోయిన ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో 18 మంది సైనికులు అమరులైనట్టు ప్రాథమిక సమాచారం అందగా ఆ తర్వాత అమరులైన సైనికుల సంఖ్య 30కి చేరినట్టు తెలుస్తోంది. ఇంకొంతమంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. పుల్వామా జిల్లా అవంతిపురలోని లెత్‌పుర ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగింది. 76వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కి చెందిన సైనికులు 70 బస్సుల్లో జమ్ము నుంచి శ్రీనగర్‌కు తరలి వెళ్తుండగా మానవబాంబు ఈ దాడికి పాల్పడ్డాడు.

దాడికి పాల్పడిన సూసైడ్ బాంబర్‌ని ఆదిల్ అహ్మద్‌గా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. జమ్ముకాశ్మీర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అదే పుల్వామా జిల్లాలోని కాకపుర ప్రాంతానికి చెందిన ఆదిల్ 2018లోనే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు సమాచారం.

Trending News