Balakrishna 50 Years Event Celebrities List : నరసింహం నందమూరి బాలకృష్ణ.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అందించడమే కాకుండా.. ఈ సంవత్సరం ఆగస్టు నెలతో.. సినిమా ఇండస్ట్రీలో..నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ.. లెజెండ్ బాలకృష్ణకి.. స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా సెప్టెంబర్ 1న.. హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతోంది.
సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్గా.. శ్రేయాస్ మీడియా వారు ఈ ఈవెంట్ ని అతిరథమహారథులు సమీక్షంలో జరపబోతోంది. మరోవైపు కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, సుచిర్ ఇండియా, వేగ జ్యువెలర్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ ఈ ఈవెంట్ ప్రోగ్సామ్స్ కు సపోర్ట్ గా నిలుస్తున్నాయి. బాలయ్య సినీ స్వర్ణోత్సవానికి ఇప్పటికే ఎంతోమందికి సినీ ప్రముఖులకు.. రాజకీయ నాయకులకు..ఆహ్వానాన్ని అందించారు. అయితే కొంతమందికి మాత్రం బాలకృష్ణ కార్యక్రమానికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించారు. వారు ఈ విషయం గురించి శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రెస్ మీట్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వివాదంపై క్లారిటీ ఇస్తూ..‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అన్ని శాఖలు వారు కలిసి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు.. ఈ వేదుకకు కేంద్ర ప్రభుత్వం నుంచి పలువురు ప్రముఖులు కూడా రాబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీ నుంచే కాకుండా..ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా.. శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మేము అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో ప్రతి ఒక్కరికి పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు సినీ పరిశ్రమ మన కుటుంబ అని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్మానం అని భావించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం’’ అని చెప్పుకొచ్చారు.
స్పాన్సర్ కిరణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో భాగం కావడం మా అదృష్టం. ఒక చారిత్రాత్మక ఈవెంట్లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటుడు, అజాత శత్రువు అయిన బాలకృష్ణ గారికి ఇలాంటి సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి’’ అని పిలుపునిచ్చారు.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కల్యాణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ గారు నటన ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అవుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని శాఖలు కలిసి ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది మొదటిసారి. ఈ కార్యక్రమానికి మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కల్యాణ్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.