అధికారులు అడ్డుకున్నా...బోటును మొండిగా తీసుకెళ్లిన వైనం

  

Last Updated : Nov 14, 2017, 01:33 PM IST
అధికారులు అడ్డుకున్నా...బోటును మొండిగా తీసుకెళ్లిన వైనం

విజయవాడ: కృష్ణానది‌లో పవిత్ర సంఘమం వద్ద బోటు బోల్తా ఘటనకు సంబంధించిన కీలక విషయం బయటికి వచ్చింది. రివర్ బోటు ఎడ్వెంచర్స్‌కు చెందిన బోటును ఓ పర్యాటక అధికారి అడ్డుకున్నట్లు తెలిసింది. పర్యాటకులను తీసుకెళ్లడానికి జీఎం నుంచి పర్మిషన్ తీసుకువస్తేనే బోటును నడిపేందుకు అనుమతి ఇస్తానని ఓ అధికారి  నిర్వాహకులకు స్పష్టం చేశారు. ప్రయాణికులను బోటు నుంచి వెంటనే దించేయాలని చెప్పిన అధికారిపై నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. ఇలా ఆ అధికారి బోటును అడ్డుకున్నప్పటికీ ..దొంగచాటుగా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లారు... డబ్బు కోసం పర్యాటకుల ప్రాణాలను బలికొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 

Trending News