ink on jagan flexi- ycp alleged in krishna district : రంగు పడింది

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీపై రంగు చల్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Last Updated : Jan 6, 2020, 02:53 PM IST
ink on jagan flexi- ycp alleged in krishna district :  రంగు పడింది

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీపై రంగు చల్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పంచాయతీ కార్యాలయంలో ఉన్న జగన్ మెహన్ రెడ్డి ఫ్లెక్సీపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పూశారు. సరిగ్గా ఆయన ముఖాన్ని నల్ల రంగుతో నింపేశారు. అంతే కాదు ఫ్లెక్సీపై ప్రభుత్వ పథకాలను కూడా రంగుతో చెరిపేసే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే పంచాయతీ సిబ్బంది చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వైసీపీ ఆందోళన 
తమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీపై నల్ల రంగు పూయడంతో.. స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేసి దోషులను అరెస్ట్ చేయాలనే డిమాండ్ తో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ పంచాయతీ కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డి బ్యానర్ పై బురద జల్లినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన రెండోసారి జరగడంతో పోలీసులు .. ఎప్పుడు ఏం జరుగుతుందోనని నిఘా పటిష్టం చేశారు. 
  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
 

Trending News