జాతిపితకు భారత ప్రధాని ఘన నివాళి

                                  

Last Updated : Oct 2, 2017, 11:37 AM IST
జాతిపితకు భారత ప్రధాని ఘన నివాళి

ఢిల్లీ : నేడు జాతిపిత మహాత్మాగాంధీ మరియు భారత దేశ మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిల జయంతి అన్న విషయం మనకు తెలిసిందే.  ఈ పర్వదినాల సందర్భంంగా దేశ రాజధాని  ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో ప్రధాని నరేంద్రమోదీ,  మహాత్మాగాంధీ పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మరియు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో  పాలు పంచుకున్నారు. ఆ తర్వాత భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్‌ఘాట్‌లోని బహదూర్‌ స్థూపానికి ప్రధానితో పాటు అధికారులందరూ నివాళులు అర్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ రామ్‌ నాయక్‌తో కలిసి రాజధాని లఖ్‌నవూలో గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.

Trending News