Ashwini Kumar Choubey: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.

Last Updated : Dec 29, 2020, 03:17 PM IST
Ashwini Kumar Choubey: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

Ashwini Kumar Choubey tested Covid-19 positive: న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు. ఇటీవల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు కేంద్ర మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

తాజాగా బీజేపీ (BJP) ఎంపీ కేంద్ర ఆరోగ్యశాఖ (MoHFW) సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే (Ashwini Kumar Choubey) కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సోమవారం సల్ఫ లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని.. ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ (Covid-19 positive) అయినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. Also Read: Rajinikanth: రాజకీయ అరంగ్రేటంపై తలైవా సంచలన నిర్ణయం

ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉండాలని అశ్వినీ కుమార్ చౌబే సూచించారు. ఎలాంటి లక్షణాలు కనిపించిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 

Also Read: India Covid-19: 98లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News