రాష్ట్రాన్ని టీడీపీ కరెప్షన్ ఆఫ్ ఆంధ్రగా మార్చింది- పవన్

జనసేన అవిర్భావ సభా వేదికగా టీడీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Last Updated : Mar 15, 2018, 04:01 PM IST
రాష్ట్రాన్ని టీడీపీ కరెప్షన్ ఆఫ్ ఆంధ్రగా మార్చింది- పవన్

జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనభవిజ్ఞుడని నమ్మి తెలుగు ప్రజలు చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే  ప్రజలను నిలువునా ముంచేశారని పవన్ ఆరోపించారు.  ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అవినీతి మయం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి లారీకి రూ.15 వేలు తీసుకుంటున్నారు. ఎర్రచందనం అమ్మి రాజధాని కడతామన్నారు.. కానీ ఇక్కడ జరుగుతుంది .. ఎర్రచందన స్మగ్లర్లు రాజ్యమేలుతున్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు నుంచి భూములు తీసుకొని వారిని కూడా నిలువునా ముంచారు. 

 లోకేష్ అవినీతితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది

ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ ఆవినీతి గురించి మాటల్లో చెప్పలేనిది. ఆయన దోరికందల్లా తనదే అన్న రీతిలో దోచుకుంటున్నారు. లోకేష్ చేసే అవినీతితో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని విమర్శించారు. చంద్రాబాబు ఆయన తనయుడు లోకేష్ అవినీతి చూసి ప్రజలు భయపడుతున్నారని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. 

సింగపూర్ అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు

సింగపూర్ తరహా రాజధాని చేయాలంటే సింగపూర్ తరహా పాలన రావాలి..కానీ ఇక్కడ మన పాలకులు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తప్పితే..ఏం చేయడం లేదు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామన్న చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు.. రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్న భూముల విషయంలో అన్యాయం జరిగితే జనసేన పోరాడుతుందని వెల్లడించారు. ఇక నుంచి టీడీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Trending News