Election Result 2022: ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం..: రాహుల్ గాంధీ

Election Result 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. ఈ నేపథ్యంలో స్పందించిన రాహుల్ గాంధీ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నట్లు చెప్పారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 06:04 PM IST
Election Result 2022: ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం... ఈ ఫలితాల నుంచి నేర్చుకుంటాం..: రాహుల్ గాంధీ

Assembly Election Result 2022:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. యూపీలో మరోసారి బీజేపీ (BJP) ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో కేజ్రీవాల్​ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP)  ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీ తన మార్క్ ను చూపించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కు మరోసారి భంగపాటు తప్పలేదు. తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్పందించారు.

''ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నాం. ఎన్నికల్లో గెలిచిన వారికి శుభాకాంక్షలు. కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలు, వాలంటీర్లకు కృతజ్ఞతలు. మేము ఈ ఎన్నికల నుండి నేర్చుకుంటాం. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూనే ఉంటాం'' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. 

తాజా ఎన్నికల ఫలితాలను చూస్తే.. ఉత్తరప్రదేశ్ లో (UP Election Result 2022) సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది హస్తం పార్టీ. కేవలం అక్కడ 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న పంజాబ్ లో అయితే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కేవలం 18 స్థానాలు మాత్రమే నెగ్గింది. దేవభూమిలో 19 స్థానాలు గెలిచి..రెండో స్థానానికి పరిమితమైంది. గోవాలో  12 స్థానాల్లో, మణిపూర్ లో 11 స్థానాల్లో గెలిచింది. 

Also Read: UP Election Results: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ జోరు... కాషాయ పార్టీ గెలుపుకు దోహదం చేసిన అంశాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News