Telangana Congress Leaders: రాహుల్ టూర్ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ..!!

Telangana Congress Leaders: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ ఈనెల 6న వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 12:26 PM IST
  • రాహుల్ టూర్ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు
  • ఈనెల 6న వరంగల్‌కి రాహుల్
  • బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న నేతలు
Telangana Congress Leaders: రాహుల్ టూర్ ఏర్పాట్లలో కాంగ్రెస్ నేతలు బిజీబిజీ..!!

Telangana Congress Leaders: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ ఈనెల 6న వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఎలుగెత్తి చూపేందుకు కాంగ్రెస్ మే 6న రోజు రైతు సంఘర్షణ పోరాట సభను నిర్వహించనుంది. లోక్‌సభ మాజీ సభ్యుడు మధు యాష్కీ గౌడ్ మంగళవారం ఖమ్మంలో పర్యటించి పార్టీ నేతలతో మాట్లాడారు. రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను కోరారు. ఏప్రిల్ 22న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, లోక్‌సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీగౌడ్‌లు వరంగల్‌లో పర్యటించి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. అదే రోజు ఖమ్మం పార్టీ కార్యకర్తలతో టీపీసీసీ చీఫ్‌ సమావేశం కానున్నారు. ఏప్రిల్ 23న గాంధీభవన్‌లో పార్టీ నేతలతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి టీపీసీసీ, డీసీసీ, అనుబంధ సంస్థల నేతలు హాజరవుతారు.

ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మధు యాష్కి. ఈ ఘటనపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడబెట్టిన ఆస్తులపై కేంద్రం సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అధికార పార్టీ వేధింపులు భరించలేక తమ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో మంత్రి పువ్వాడ అజయ్‌ ఏ1గా ఉన్నారని.. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యకు పాల్పడినందుకు ఏసీపీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపైనా ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Also Read: BJP Leaders Meet: తెలంగాణ గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

Also Read:Luthiana Fire Accident: లూథియానాలో అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబంలో ఏడుగురు సజీవ దహనం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News