'ఎన్టీఆర్' కోసం..వాళ్లిద్దరూ..!

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి తేజ తప్పుకోవడంతో దర్శకుడి స్థానం ఖాళీగా ఉండిపోయింది.

Last Updated : May 21, 2018, 09:09 AM IST
'ఎన్టీఆర్' కోసం..వాళ్లిద్దరూ..!

‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ నుంచి తేజ తప్పుకోవడంతో దర్శకుడి స్థానం ఖాళీగా ఉండిపోయింది. దీంతో ఇక ఆ బాధ్యత కూడా నందమూరి బాలకృష్ణ స్వీకరిస్తారని, ఆయనే 'ఎన్టీఆర్' చిత్రానికి దర్శకుడని ప్రచారం కూడా జరిగింది. అయితే.. బాలకృష్ణ ఈ విషయంలో ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నిర్మాతగా, నటుడిగా.. ఇక దర్శకుడిగా కూడా మారితే బాధ్యతలు మోయడం కష్టమవుతుందని.. దర్శకత్వ బాధ్యతలను వేరొకరి చేతుల్లో పెట్టాలని భావిస్తున్నారట.

దర్శకత్వ బాధ్యతలను క్రిష్ చేతిలో పెట్టేందుకు బాలయ్య ప్రయత్నిస్తున్నాడట. ఈ మేరకు క్రిష్‌తో బాలయ్య సంప్రదింపులు కూడా జరిపారని, ఆయన కూడా ఓకే చెప్పారని, ఆయనే దాదాపుగా ఖాయమని సమాచారం. అలాగే ఈ మూవీలో హీరో శర్వానంద్ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడట. ఇటీవల ‘ఎన్టీఆర్‌’ చిత్రబృందం శర్వాని సంప్రదించిందని, శర్వా కూడా తన అంగీకారం తెలిపాడని సమాచారం. ఎన్టీఆర్ యుక్తవయసులో ఉన్న పాత్రలో బాలకృష్ణ నటించడం కష్టమైనా పనే. అందుకే యువ ఎన్టీఆర్ పాత్రకోసం శర్వానంద్‌ని ఎంపిక చేశారట.

Trending News