Gautam Adani: రేవంత్‌ రెడ్డి సంచలనం.. మరోసారి గౌతమ్‌ అదానీతో భేటీ, రూ.100 కోట్ల విరాళం

Gautam Adani Meets To Revanth Reddy Viral Photos: రేవంత్‌ రెడ్డి మరో సంచలనం సృష్టించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై తీవ్ర ఆరోపణలు.. విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మరోసారి సమావేశమయ్యారు. రేవంత్‌తో సమావేశమైన అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు.

1 /7

 దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

2 /7

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు.

3 /7

అదానీ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటూ వివాదానికి తెరలేపుతోంది.

4 /7

మరోసారి అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో రేవంత్‌ రెడ్డి సమావేశమై సంచలనం రేపారు.

5 /7

రేవంత్‌ రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమైన అనంతరం అదానీ కొన్ని అంశాలపై చర్చించినట్లు సమాచారం.

6 /7

కొత్త ఏర్పాటుచేయాలనుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి గౌతమ్‌ అదానీ రూ.100 కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు.

7 /7

మరోసారి గౌతమ్‌ అదానీ, రేవంత్‌ రెడ్డి సమావేశమవడంతో తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది.