Sharad Purnima 2022: శరత్ పౌర్ణిమను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..చంద్రున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Sharad Purnima 2022: భారత సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం శరత్ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈరోజు సాయంత్రం పూట లక్ష్మీదేవిని పూజించి రాత్రి సమయంలో చందమామను పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2022, 11:17 AM IST
Sharad Purnima 2022: శరత్ పౌర్ణిమను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..చంద్రున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..

Sharad Purnima 2022: శరత్ పౌర్ణిమ భారత్లో ఎంతో ప్రముఖమైన రోజు. ఆ రోజు భక్తులంతా లక్ష్మీదేవితో పాటు సాయంత్రం పూట చంద్రుని పూజించడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు చంద్రునికి ఓ ప్రత్యేకత కలిగి ఉంది. చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడమే కాకుండా 16 కళలను నిండి ఉంటాడని శాస్త్రంలో పేర్కొన్నారు. ఈరోజు చంద్రుని నుంచి వచ్చే కాంతి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని.. చంద్రుని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది శరత్ పౌర్ణమి రోజు చేయకూడని కొన్ని పనులను చేస్తున్నారు. వీటివల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అయితే ఈరోజు ఎలాంటి తప్పులను చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. శరత్ పౌర్ణమి రోజున ఎవరిపైన కోపంగా ఉండకూడదు. అంతేకాకుండా వెల్లుల్లిని అసలు వినియోగించకూడదని శాస్త్రం సూచిస్తుంది.
2. అంతేకాకుండా తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించాల్సి ఉంటుంది. 
3. ఈరోజు నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించవద్దు. ప్రకాశంవంతమైన తెలుపుతూ కూడిన దుస్తులను ధరిస్తే చాలా మేలు.
4. పురాణాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం చంద్రుని వెలుగులో చక్కెరతో చేసిన ఖీర్ ఉంచి నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
5. లక్ష్మీ పూజలో భాగంగా ఇంట్లో ఎలాంటి పరస్పర విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి. విభేదాలు జరిగితే అది పేదరికానికి దారి తీయవచ్చు అని శాస్త్రం చెబుతోంది.

ఈ నియమాలు తప్పక పాటించండి:
శరత్ పౌర్ణమి రోజున సాయంత్రం పూట స్నానం చేసి ఆవుపాలతో పొంగలి ప్రసాదాన్ని తయారుచేసి శ్రీకృష్ణుని నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇదే క్రమంలో అర్ధరాత్రి చందమామను కూడా పూజించాల్సి ఉంటుంది. చందమామను చూస్తూ ఈ మంత్రాన్ని"ఓం సోమ సోమాయ నమః" పారాయణం చేయాల్సి ఉంటుంది.  

సిరి సంపదలు లభిస్తాయి:
సాయంత్రం పూట లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పిస్తే కుటుంబంలో సుఖశాంతులు లభించి సిరి సంపదలు కలుగుతాయని శాస్త్ర చెబుతోంది. అంతేకాకుండా పూజలో భాగంగా "ఓం హ్రీం శ్రీ కమలే కమలయే ప్రసీద్ ప్రసీద్ మహాలక్ష్మయే నమః" ఈ మంత్రాన్ని కూడా ఉపదేశించాల్సి ఉంటుంది.

Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు 

Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News