IPL 2022 Mega Auction: వచ్చే నెలలో ఐపీఎల్​ మెగా వేలం- ఏ టీమ్​ ఎంత ఖర్చు చేయొచ్చంటే..

IPL 2022 Mega Auction: మెగా వేలం కోసం ఐపీఎల్ పాలక మండలి కసరత్తు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలోనే వేలం ఉండనున్నట్లు తెలిసింది. ఈ సారి మొత్తం 10 ఫ్రాంఛైజీలు వేలంలో పాల్గొననున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 12, 2021, 05:24 PM IST
  • ఐపీఎల్​ మెగా వేలం కోసం పాలక మండలి కసరత్తు
  • వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం
  • ఈ సారి వేలంలో పాల్గొననున్న పది ఫ్రాంఛైజీలు
IPL 2022 Mega Auction: వచ్చే నెలలో ఐపీఎల్​ మెగా వేలం- ఏ టీమ్​ ఎంత ఖర్చు చేయొచ్చంటే..

IPL mega auction was slated to take place in January: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మెగా వేలానికి ఇంకా నెల రోజులే మిగిలి ఉంది. సంబంధిత వర్గాల ప్రకారం.. 2022 జనవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించే (IPL mega auction date) వీలుంది. ఇందులో పది టీమ్​లు (Ten teams in IPL) పాల్గొననున్నాయి.

ఎనిమిది టీమ్​లు ఇప్పటికే ఐపీఎల్​లో ఉండగా.. ఇప్పుడు కొత్తగా (New teams in IPL) రెండు టీమ్​లు (లఖ్​నవూ, అహ్మదాబాద్​లు) వచ్చి చేరాయి.

మెగా వేలానికి ముందు ప్రస్తుతం టీమ్​లో ఉన్న వారిలో ముగ్గురు ప్లేయర్స్​ను రీటైన్​ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఇద్దరు ఇండియన్ ఆటగాళ్లు, ఒక ఫారిన్ ప్లేయర్​ ఉండాలనే నిబంధన విధించింది. గత నెల 30తోనే ఈ గడువు ముగిసింది. అంతకు ముందే ఎనిమిది టీమ్​లు తమ రీటైన్ జాబితాను ఐపీఎల్ (IPL latest news) పాలక మండలికి సమర్పించాయి.

కొత్త ఫ్రాంఛైజీల​కు ఈ నెల 25 వరకు అవకాశం..

కొత్తగా వచ్చిన ఐపీఎల్​ టీమ్​లు మెగా వేలానికి ముందు.. ముగ్గురు ప్లేయర్స్​ (ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు, ఒక విదేశీ ఆటగాడు) ను తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది పాలక మండలి. మిగతా 8 ఫ్రాంఛైజీల రిటైన్ జాబితాలో లేని ప్లేయర్స్​ను నేరుగా తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

ఇక ఈ సారి మెగా వేలంలో ఒక్కో టీమ్​కు​ రూ.90 కోట్ల పరిమితి విధించిది పాలక మండలి. రీటైన్ చేసుకున్న ప్లేయర్స్​కు ఇచ్చిన మొత్తాన్ని పక్కనబెట్టి మిగిలిన మొత్తంతో మాత్రమే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఈ సారి ఏ టీమ్​కు కూడా రైట్​ టూ మ్యాచ్ (ఆర్​టీఎం) కార్ట్ వినియోగించుకునే (IPL Megha Auction rules) అవకాశం లేదు.

రీటైన్​​ తర్వాత టీమ్స్ వద్ద మిగిలిన మొత్తం..

ఈ సారి వేలంలో పంజాబ్ కింగ్స్ (PBKS)​ రూ.72 కోట్లతో వేలానికి రానుంది. సన్​ రైజర్స్ హైదరాబాద్ (SRH​) రూ.68 కోట్లతో వేలంలో పాల్గొననుంది.

రాజస్థాన్​ రాయల్స్ (RR) వద్ద వేలం కోసం రూ.62 కోట్లు ఉన్నాయి. రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.57 కోట్లతో వేలంలో పాల్గొనేందుకు అవకాశం ఉంది.

ముంబయి ఇండియన్స్ (MI), చెన్నై సూపర్​ కింగ్స్ (CSK), కోల్​కతా నైట్​ రైడర్స్ (KKR) వద్ద రూ.48 కోట్ల చొప్పున వేలం కోసం వినియోగించేందుకు నిధులు ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద అత్యల్పంగా రూ.47 కోట్లు మాత్రమే వేలం కోసం మిగిలి ఉన్నాయి.

ఇక కొత్త టీమ్స్ లఖ్​నవూ, అహ్మదాబాద్​ రూ.90 కోట్ల చొప్పున వినియోగించుకునే అవకాశం ఉంటుంది. వేలానికి ముందు ముగ్గురు చొప్పున తీసుకునే ప్లేయర్స్ కూడా ఇందులో నుంచే కేటాయించాల్సి ఉంటుంది.

Also read: Sourav Ganguly: కోహ్లీ లేకుండానే టీమ్ ఇండియాకు టైటిల్, రోహిత్‌పై గంగూలీ ప్రశంసలు

Also read: IND Vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ షాకింగ్ డెసిషన్.. కారణం అదేనా?!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News