భారత్ vs న్యూజిలాండ్‌ 2వ టీ20: చెలరేగిన రోహిత్ శర్మ.. 7 వికెట్లతో టీమిండియా గెలుపు

భారత్ vs న్యూజిలాండ్‌ 2వ టీ20: 7 వికెట్లతో టీమిండియా గెలుపు

Last Updated : Feb 8, 2019, 10:11 PM IST
భారత్ vs న్యూజిలాండ్‌ 2వ టీ20: చెలరేగిన రోహిత్ శర్మ.. 7 వికెట్లతో టీమిండియా గెలుపు

ఆక్లాండ్: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మరో 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని ముద్దాడింది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచి మూడు టీ20ల సిరీస్‌‌ని 1-1తో సమం చేసింది. టీమిండియా కెప్టేన్ రోహిత్ శర్మ కేవలం 29 బంతుల్లో చేసిన 50 పరుగులు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. శిఖర్ ధావన్ 30, పంత్ 40, ధోనీ 20 పరుగులు చేశారు. 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీసిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సిరీస్ ఫలితాన్ని తేల్చే 3వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. 

అంత‌కుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు ఒకవిధంగా ఆదిలోనే కష్టాల్లోపడింది. 8 ఓవర్లలో 50 పరుగులకే ఓపెనర్లు సహా 4 కీలక వికెట్లు కోల్పోయిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, టేలర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2, భువనేశ్వర్, హార్దిక్ చెరో వికెట్ పడగొట్టారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x