టీమిండియా లక్ష్యం జస్ట్.. 135 మాత్రమే..!

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యా‌చ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది.

Last Updated : Dec 24, 2017, 09:18 PM IST
టీమిండియా లక్ష్యం జస్ట్.. 135 మాత్రమే..!

వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టీ20 మ్యా‌చ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ శ్రీలంకను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆదిలోనే హంసపాదులా శ్రీలంకకు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది.

రెండో ఓవరులో ఐదో బంతికి 8 పరుగుల స్కోరు వద్ద ఉనద్కత్ బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌వెల్లా (1) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత లంక వికెట్ల పతనం మొదలైంది. భారత బౌలర్లు ధాటికి తట్టుకోలేక లంకేయులు వరుసగా వికెట్లు పోగొట్టుకున్నారు. లంక ఆటగాళ్ళల్లో అసెల గుణరత్నె చేసిన 36 పరుగులే అధిక స్కోరు. 

 

Trending News