శ్రీలంక స్టార్ బౌలర్ మలింగా తన ఫిట్ నెస్ ఎలాంటిదో ప్రపంచానికి మరోసారి రుజువైంది. గంటల వ్యవధిలో రెండు దేశాల్లో క్రికెట్ ఆడి... మలింగ సత్తా చాటాడు..వివరాల్లోకి వెళ్లినట్లయితే....
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న మలింగా... చైన్నై సూపర్ కింగ్స్ తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి సత్తా చాటిన విషయం తెలిసిందే. మరుసటి రోజు తన స్వదేశంలోని జరగాల్సిన వన్డే సిరీస్ లో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు హాజరయ్యేందుకు అర్ధరాత్రి 1:40కి ఇండియా నుంచి బయల్దేరి మరుసటి తెల్లవారుజామున శ్రీలంక చేరుకున్నాడు.
శ్రీలంకలో ఉదయం 9.45 గంటలకు వన్డే సూపర్ ఫోర్ టోర్నీ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన మలింగ 10 ఓవర్లలో 49 పరుగులిచ్చి 7 వికెట్లు కూల్చాడు. కేవలం 10 గంటల వ్యవధిలలో రెండు దేశాల్లో రెండు మ్యాచ్ లు ఆడి సత్తాచాటిన క్రికెటర్ గా మలింగ సరికొత్త రికార్డుల్లోకి నెలకొల్పాడు..మలింగ మాజాకా !!