ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్

ప్రగతి భవన్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు

Last Updated : Oct 23, 2019, 02:25 PM IST
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు తెలంగాణలోని ఏబీవీపీ(అఖిల భారత విద్యా పరిషత్) నేతలు, కార్యకర్తలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్‌ గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్‌ పీఎస్‌కు తరలించారు.

ఇదిలావుంటే, ఇంకొన్ని చోట్ల ఏబీవీపి నేతలు, కార్యకర్తలు ఉంటున్న యూనివర్శీల హాస్టల్స్, వాటి అనుబంధ కళాశాలల హాస్టల్స్‌ వద్దకు చేరుకున్న పోలీసులు.. అక్కడే వారిని ముందస్తు జాగ్రత్త చర్యగా అరెస్ట్ చేశారని ఏబీవీపి నేతలు తెలిపారు.

Trending News